స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -157 లో... రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకొని వచ్చి.. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది. ఆడ్ ఏజెన్సీకి ఇవ్వాల్సిన నా కాన్సెప్ట్ అనగానే.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. నువ్వు ఇచ్చిన ఐడియాతో ఇలా కాన్సెప్ట్ రెడీ చేశాను. ఈ రింగ్ తీసుకోమని సీతాకాంత్ అనగానే.. నాకేం వద్దు మీ రింగ్ అని రామలక్ష్మి కోపంగా పక్కకి వెళ్తుంది. కాన్సెప్ట్ మాత్రం ఆడ్ వాళ్ళకి కానీ నిజంగానే నా ప్రేమ నీకు చెప్పాను రామలక్ష్మి.. ఈ రింగ్ ఇచ్చి నా మనసులో మాట నీకు చెప్తానని సీతాకాంత్ అనుకుంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మి కూడా సర్ కళ్లలో నా పైన ప్రేమ కన్పించింది. మరి అంతా చెప్పేసి ఆడ్ కోసం అన్నారని రామలక్ష్మి అనుకుంటుంది. మరుసటిరోజు ఉదయం సందీప్ దగ్గరికి ఒకతను ల్యాండ్ కొనమని అందుకు కమిషన్ ఇస్తానని సూట్ కేసులో డబ్బులు తీసుకొని వస్తాడు. ఆ డబ్బులు చుసిన శ్రీవల్లి ఒప్పుకోండి అంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. విషయం చెప్పగానే ఒప్పుకోమని శ్రీలత అంటుంది. అది ఇండస్ట్రీ పెట్టడానికి సెట్ అవ్వదని శ్రీలత అంటుంది. ఐతే ఏంటి తర్వాత ఇండస్ట్రీ పెట్టాక అందరు సీతాకాంత్ ని తిడుతారు. అదంతా సీతాకాంత్ కావాలనే చేసాడని రూమర్స్ క్రియేట్ చేస్తానని శ్రీలత అనగానే.. సందీప్ ఆ డీల్ ఒప్పుకొని డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది. ఎందుకు ఎలా వాడు మేనేజర్ అయ్యాడని మాణిక్యం అడగ్గానే.. రామలక్ష్మి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి నమిత దగ్గరికి వెళ్తుంది. పని చేసుకోకుండా సీతాకాంత్ వైపు నమిత చూస్తుంటుంది. అది గమనించిన రామలక్ష్మి.. మీరు వర్క్ చెయ్యడం కాకుండా ఎక్కువ చూడడం చేస్తున్నారని అంటుంది. సర్ నా రోల్ మోడల్.. మీరు జాక్ పాట్ కొట్టారు మేడమ్ అని నమిత అంటుంది. అప్పుడే సీతాకాంత్ కి దగ్గు వస్తుంటే.. రామలక్ష్మి వాటర్ తీసుకొని వెళ్తుంటుంది. తనకంటే ముందే నమిత వెళ్లి వాటర్ ఇస్తుంది. సీతాకాంత్ చూసుకోకుండా థాంక్స్ రామలక్ష్మి అని అంటాడు. అప్పుడు నమితని చూసి నువ్వా.. వెళ్లి వర్క్ చేసుకోమని అనగానే నమిత వెళ్తుంది. వెనకాల వున్నా రామలక్ష్మి కోపంగా చూస్తుంది. ఆ ఫైల్ ఇవ్వమని సీతాకాంత్ అనగానే.. నేను ఎందుకు ఇస్తాను మీరంటే ఇష్టమున్న వాళ్ళు చాలా మంది ఆఫీస్ లో ఉన్నారు.. వాళ్ళు ఇస్తారంటూ కోపంగా వెళ్తుంది రామలక్ష్మి.
ఆ తర్వాత మాణిక్యంతో చెప్పి రామలక్ష్మిని రమ్మని సందీప్ చెప్పగానే.. మాణిక్యం వెళ్లి రామలక్ష్మికి చెప్తాడు. రామలక్ష్మి రాగానే పేపర్స్ తన మొహం పైన విసురుతాడు సందీప్. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేయమంటే చేయలేదని సందీప్ అంటాడు. సీతా సర్ ఒకే చేయకుండా నేను చెయ్యనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్లి బాధపడుతుంటే.. అప్పుడే మాణిక్యం వచ్చి.. వాడేదో అని ఉంటాడని అంటాడు. ఏదో ల్యాండ్ గురించి ఒకటే ఫోన్ మాట్లాడుతున్నాడని మాణిక్యం చెప్తాడు. వాడు ఏదో ప్లాన్ తోనే జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఈ ల్యాండ్ ఏంటో ఆ పేపర్స్ వాడి చేతికి వెళ్లకముందే నా చేతికి రావాలి.. అప్పుడే మనం దీన్ని ఆపగలమని రామలక్ష్మి అనగానే.. నువ్వు టెన్షన్ పడకు పేపర్స్ కావాలి కదా.. వాడేంటో? వాడి ప్లాన్ ఏంటో నేను కనుక్కుంటా అని మాణిక్యం అంటాడు. అప్పుడే బోర్డు మీటింగ్ కి రమ్మంటున్నారని పీఏ వచ్చి రామలక్ష్మికి చెప్పగానే.. తను మీటింగ్ కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.